ఉక్కు పరిశ్రమను ప్రారంభించనున్న చంద్రబాబు

SMTV Desk 2018-12-27 11:20:26  Andhrapradesh, CM, Chandrababu, Steel factory

అమరావతి, డిసెంబర్ 27: ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా మైలవరం మండలం ఎం.కంబాలదిన్నెలో ఉక్కు పరిశ్రమ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ పరిశ్రమకు కేంద్ర సర్కార్ సహకరింహక పోయినా రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని సొంతంగా ప్రారంభించడానికి సిద్దమవుతుంది. ఇప్పటికే పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన అన్ని లాంఛనాలను పూర్తిచేసిన ప్రభుత్వం ఈ రోజు వైభవంగా దీన్ని ప్రారంభించబోతున్నారు.

ఈ విషయాన్ని చంద్రబాబు తన అధికార ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. "విభజన చట్టంలో ఉన్నా కూడా కడపకు స్టీల్ ఫ్లాంట్ ఇవ్వలేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉక్కు సంకల్పంతో కడపలో స్టీల్‌ ప్లాంట్‌కు శంకు స్థాపన చేసి, పూర్తిచేసే బాధ్యత తీసుకుంది." అని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.