హైదరాబాద్, డిసెంబర్ 26: కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ విధి విధానాలపై మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో తెలంగాణ ఎన్నికల కమీషన్ పూర్తిగా విఫలమైందని, ఈవిఎంల టాంపరింగ్ జరిగిందని ఆరోపించారు. సీఎం కేసిఆర్ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారాన్ని పక్కన పెట్టి ఫెడరల్ ఫ్రంట్ అని తిరుగుతున్నారని విమర్శించారు. పంచాయితీ ఎన్నికల కోసమే బతుకమ్మ చీరలను ప్రభుత్వం పంపిణీ చేసిందని, రైతు బంధుకు రుసుం చెల్లించలేని దుస్థితి దాపురించిందని ఆయన విమర్శించారు.