న్యూఢిల్లీ, డిసెంబర్ 26: భారత దేశ రాజధాని న్యూఢిల్లీలో ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయిన సంగతి తెల్సిందే. సుమారు గంటన్నర పాటు సాగిన అనంతరం సమావేశం ముగిసింది. ప్రధాని మోదికి కేసీఆర్ 16 అంశాలపై వినతి పత్రం సమర్పించారు.
ఆ 16 అంశాలు ఇవే..
1. సచివాలయ నిర్మాణానికి బైసన్పోలో గ్రౌండ్ అప్పగించాలని విజ్ఞప్తి
2. కరీంనగర్లో త్రిబుల్ ఐటీ ఏర్పాటు
3. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు
4. నూతన జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటు
5. హైదరాబాద్లో ఐఐఎస్ఈఆర్ ఏర్పాటు
6. ఆదిలాబాద్లో సిమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ
7. జహీరాబాద్లో నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటు
8. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం లేదా ప్రత్యేక సాయం అందించాలని విజ్ఞప్తి
9. విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్లోని సంస్థలను వెంటనే విభజించాలి.
10. రైల్వే ప్రాజెక్టులకు వెంటనే నిధులు కేటాయింపు
11. వరంగల్లో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు
12. ఎస్సీ వర్గీకరణ
13. కృష్ణా నదీ జలాల పంపిణీపై తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్లను ట్రిబ్యునళ్లకు కేంద్ర ప్రభుత్వం రిఫర్ చేయాలి.
14. వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు వెయ్యి కోట్ల రూపాయలు ముంజూరు చేయాలని విజ్ఞప్తి
15. వెనకబడిన జిల్లాలకు రూ.650 కోట్ల నిధులు విభజన చట్టం ప్రకారం కేటాయింపు
16. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద తెలంగాణాకు నిధులు కేటాయింపు