మరో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు

SMTV Desk 2018-12-26 13:13:08  AP, CM, Chandrababu, Amaravaati,Release White papers, Agriculture sector

అమరావతి, డిసెంబర్ 26: రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎదుర్కొంటున్న కష్టాలతో పాటు తెదేపా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. తాజాగా ఉండవల్లిలోని ప్రజావేదిక వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన ఇవాళ నాలుగవ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. వ్యవసాయం అనుబంధ రంగాల్లో ప్రభుత్వం అమలు చేస్తోన్న కార్యక్రమాలపై చంద్రబాబు ఈ శ్వేత పత్రాన్ని విడుదల చేశారు.

ఇదివరకు అమరావతిలో ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలపై శ్వేత పత్రాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా సోమవారం సుపరిపాలనపై రెండో శ్వేతపత్రాన్ని విడుదల చేయాగా మంగళవారం సంక్షేమం, సాధికారికతపై మూడో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు.