సింగపూర్, డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి, తెదేపా నేత నారా లోకేష్ కొద్ది సేపటి క్రితం సింగపూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని తన అధికార ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. సింగపూర్ ప్రభుత్వం ఎస్ఆర్ నాథన్ ఫెలోషిప్ గౌరవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారాలోకేష్ కు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ అరుదైన గౌరవాన్ని స్వీకరించేందుకు సింగపూర్ వెళ్లారు నారా లోకేష్. నేటి నుండి మూడు రోజుల వరకు అక్కడే పర్యటించనున్నారని సమాచారం. ఈ పర్యటనలో లోకేష్ తో పలువురు సింగపూర్ మంత్రులతో నారా లోకేష్ సమావేశం కానున్నారు.
Landed in #Singapore to a warm reception from members of Singapore @JaiTDP. Also interacted with several Telugus who accompanied me on the flight from #Vijayawada pic.twitter.com/dviTcWJun1
— Lokesh Nara (@naralokesh) December 26, 2018