హైదరాబాద్, డిసెంబర్ 26: నేటి నుండి ఓటరు జాబితా సవరణల ప్రక్రియ మొదలవనుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రెండు నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని జిహెచ్ఎంసి సర్కిల్ 15 డిఎంసి ఉమాప్రకాష్ తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన నమోదుకు సంబంధించి నేడు డ్రాఫ్ట్ ఓటరు జాబితాను విడుదల చేస్తామన్నారు.
నేటి నుంచి జనవరి 25వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదు, పొరపాట్ల సవరణలకు అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. ఫిబ్రవరి 18వ తేదీలోపు అభ్యంతరాలకు సబంధించిన దరఖాస్తులను ఆమోదించి 22వ తేదీన పూర్తి స్థాయి ఓటరు జాబితాను విడుదల చేస్తామన్నారు. 26 నుంచి ప్రారంభమయ్యే ఓటరు నమోదును అందరూ సద్వినియోగం చేసుకోవాలని డిఎంసి ఉమాప్రకాష్ కోరారు.
జనవరి 1, 2019 నాటికి 18 ఏళ్ళు నిండిన వారు, ఓటరు జాబితాలో పేరులేని వారు, మార్పులు, చేర్పులు చేసుకోవాలని అనుకున్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అని తెరాస పార్టీ నుండి కూడా సమాచారం అందించారు.
Revision of voters’ list begins today… Don’t miss the opportunity to register as a VOTER
— BRS Party (@BRSparty) December 26, 2018
నేటి నుంచి కొత్త ఓటర్ల నమోదు...
జనవరి 1, 2019 నాటికి 18 ఏళ్ళు నిండిన వారు, ఓటరు జాబితాలో పేరులేని వారు, మార్పులు, చేర్పులు చేసుకోవాలని అనుకున్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. pic.twitter.com/2MDx8Fo00A