కేబినెట్ విస్తరణ.. ఇద్దరు మహిళలకు చోటు..!

SMTV Desk 2018-12-25 19:07:26  Kamal Nath, Madhya Pradesh, Election Result 2018

భోపాల్‌, డిసెంబర్ 25 : మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ మంగళవారం కేబినెట్ విస్తరణ చేపట్టారు. 28 ఎమ్మెల్యేలకు మంత్రులుగా అవకాశం కల్పించిన ఆయన..అందులో ఇద్దరు మహిళలకు చోటు కల్పించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆనందిబెన్‌ పటేల్‌ వీరి చేత ప్రమాణస్వీకారం చేయించారు. గోవింద్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, బాలా బచ్చన్‌, అరిఫ్‌ అకిల్‌, ప్రదీప్‌ జైస్వాల్‌, సజ్జన్‌ సింగ్‌ వర్మ, హుకుమ్‌ సింగ్‌ కరడ, విజయలక్ష్మీ సాధూ, ఇమ్రతీ దేవి తదితర ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.

అయితే పదిహేనేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డిసెంబరు 17న ఆ పార్టీ సీనియర్‌ నేత కమల్‌నాథ్‌ ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రైతు ఋణమాఫీపై సంతకం చేసారు.