విజయవాడ, డిసెంబర్ 25: క్రిస్మస్ పర్వదిన సందర్భంగా నగరంలోని సెయింట్ పాల్స్ బసలికా చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. అనంతరం బాబు మాట్లాడుతూ ప్రతి సమస్యకు బైబిల్, ఏసు బోధనల్లో పరిష్కారం లభిస్తుందని అన్నారు. మానవ జన్మలో కష్టాలు, సుఖాలు రెండూ ఉంటాయని, నీతి నిజాయతీకి కట్టుబడి ఉండాలని పిలుపునిచ్చారు. క్రిస్టియన్లు సేవ కు మారుపేరు అని కొనియాడారు. క్రిస్టియన్ మిషనరీ స్థాపించిన స్కూళ్లలో చదివిన వారు ఇవాళ ఉన్నతమైన పదవుల్లో ఉన్నారని గుర్తుచేశారు. చరిత్ర ఉన్నంత వరకు మదర్ థెరిసా గుర్తిండిపోతారని కొనియాడారు.