రైల్వే పట్టాలపై యువతి ఆత్మహత్యాయత్నం...

SMTV Desk 2018-12-25 15:56:41  Hyderabad city, MMTS Trains, Bharath nagar railway station, Sucide attepmt, Woman

హైదరాబాద్/భరత్ నగర్, డిసెంబర్ 25: భరత్ నగర్ రైల్వే స్టేషన్ ప్రాంత పరిధిలో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రాణాలతో బయటపడింది. వివరాల ప్రకారం సోమవారం ఉదయం భరత్‌నగర్ రైల్వే స్టేషన్‌ పరిధిలో హైదరాబాద్‌కు చెందిన ఓ 20 ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకొని పట్టాలపై నిల్చుంది. అనంతరం లింగంపల్లి వైపుగా వెళుతున్న ఎంఎంటీఎస్ స్టేషన్ నుంచి కొంచెం దూరం కదిలింది. వెంటనే సదరు యువతి పట్టాలపై ఎంఎంటీఎస్ వైపుకు పరిగెత్తుకొచ్చింది.

దీనిని గమనించిన ట్రైన్ లోకోపైలట్‌కు ఆమె ఆలోచన అర్థమైపోయింది. వెంటనే బ్రేకులు వేశాడు నెమ్మదిగా వెళ్తుండటం వల్ల ఆమెను స్వల్పంగా ఢీకొని ఎంఎంటీఎస్ ఆగిపోయింది. దీనిపై లోకో‌పైలట్ పోలీసులకు సమాచారమివ్వడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. స్వల్పగాయాలు కావడంతో యువతికి గాంధీ ఆసుపత్రిలో చికిత్స అందించారు. మరో ఘటనలో లక్డీకపూల్ స్టేషన్ వద్ద కదులుతున్న రైలులోంచి దూకి మహబూబ్‌నగర్‌కు చెందిన సాంబశివుడు అనే 67 ఏళ్ల వృద్ధుడు మరణించాడు.