న్యూఢిల్లీలో విమాన రాకపోకలు నిలిపివేత..!

SMTV Desk 2018-12-25 13:17:32  New Delhi, Airport

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: తీవ్రమైన పొగమంచు కారణంగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈరోజు ఉదయం నుంచి వొక్క విమానం కూడా టేకాఫ్ అవ్వకపోడంతో వేలమంది విమానాశ్రయంలో పడిగాపులు కాస్తున్నారు. ఈరోజు ఉదయం గం.7.30 నుంచి విమానాలను నిలిపివేసినట్లు ఎయిర్ పోర్టు అధికారులు తెలిపారు. విమాన సర్వీసుల పునరుద్ధరణపై అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడక పోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

శీతాకాలంలో ఢిల్లీని కమ్మేసే మంచుతో తరచుగా ఇదే విధమైన సమస్య ఏర్పడుతుందన్న సంగతి తెలిసిందే. గడచిన ఆర్థిక సంవత్సరంలో 12 రోజుల పాటు కనీసం 50 మీటర్ల దూరంలోని వాహనాలు కనిపించనంత పొగమంచు ఢిల్లీని కమ్మేసింది. మరో 17 రోజుల పాటు 200 మీటర్ల దూరం కనిపించని పరిస్థితి నెలకొంది.