ఢిల్లీలో బిజీబిజీగా కేసీఆర్‌.!

SMTV Desk 2018-12-25 12:43:53  KCR, Third front, Mayawati, Akhilesh Yadav, Delhi tour

న్యూఢిల్లీ,డిసెంబర్ 25: జాతీయ రాజకీయాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ లకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ సీఎం కెసిఆర్ మంగళవారం ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు. కాంగ్రెస్‌, బీజేపీలకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను వొక కూటమిగా తెరపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్‌ ఇప్పటికే వొరిస్సా సీఎం నవీన్ పట్నాయక్, బెంగాల్ సీఎం మమత బెనర్జీతో భేటీ అయి చర్చలు జరిపిన విషయం తెలిసిందే.

సోమవారం​ రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయన..కొద్దిసేపట్లో బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌తో విడివిడిగా సమావేశం కానున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై మాయావతి, అఖిలేశ్‌తో చర్చల అనంతరం.. పలు జాతీయ సంఘాల ప్రతినిధులతోనూ కేసీఆర్‌ సమావేశం కానున్నారు. ఇక, హస్తిన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోదీని కేసీఆర్‌ బుధవారం మర్యాదపూర్వకంగా కలుస్తారు.