కలకత్తా, డిసెంబర్ 25: పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని భాజపా కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. తమ పార్టీ కనుక రాష్ట్రంలో అధికారంలోకి వస్తే పోలీసుల యూనిఫాంలు విప్పిస్తామని ఆయన హెచ్చరించారు. తప్పుడు కేసులు పెట్టే వారు యూనిఫాం ధరించడానికి అనర్హులని అన్నారు. తాము ప్రతీ ఘటనను రికార్డు చేస్తున్నామని, బీజేపీ కార్యకర్తలపై ఎవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో వారందరినీ గుర్తించినట్టు చెప్పారు. చేసిన తప్పుకు తిరిగి వారంతా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరికలు జారీ చేశారు.