కేసీఆర్ ను ఘనంగా సన్మానించిన తెదేపా నేత

SMTV Desk 2018-12-24 17:42:15  KCR, TS CM, AP, TDP, Kuracha narashimha nayudu

విశాఖపట్నం, డిసెంబర్ 24: ఆదివారం నగరంలోని శారదాపీఠంలో స్వరూప నరేంద్ర సరస్వతిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చీడికాడ మండలానికి చెందిన టీడీపీ నేత, సాంస్కృతిక విభాగం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, ప్రముఖ కవి కురచా నరసింహ నాయుడు దంపతులు వెళ్లి కేసీఆర్‌ దంపతులను ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ నరసింహ నాయుడుతో 1996లో పరిచయం ఏర్పడిందని చెప్పారు. కేసీఆర్ తో స్నేహం దొరకడం తన అదృష్టమని, పూర్వ జన్మ సుకృతమని చెప్పుకొచ్చారు. కార్యక్రమంలో నాయుడు సతీమణి అమ్మాజీ, తన కుమారులు కన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.