హైదరాబాద్, డిసెంబర్ 24: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆసక్తికర వాఖ్యలు చేశారు. షెడ్యూల్ 10 నాలుగో పేరాలో ఎక్కడా పార్టీని మెర్జ్ చేసే అధికారం కోసం లేదని ఎన్నికల సంఘానికి మాత్రమే విలీనం చేసే అధికారం ఉంటుందన్నారు.
రాష్ట్రంలో దుర్మార్గ పాలన ఉందని ఆయన విమర్శించారు. సిఎం కార్యాలయంలో డ్రాఫ్ట్ తయారైందని ఆకుల లలిత, సంతోష్ వెళ్లి వలీనానికి సంబంధించిన లేఖ ఇవ్వగానే త్వరగా విలీనం చేశారని ఆరోపించారు.