హైదరాబాద్, డిసెంబర్ 24: ఎమ్మెల్సీ రాములు నాయక్ టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఆసక్తికర వాఖ్యలు చేశారు. తనని రాష్ట్ర ప్రభుత్వం చంపాలని చూస్తుందని దీనిపై కోర్టుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఏడాది క్రితం నుండి తనను టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు. తనను ఏదో వొక కేసులో ఇరికించి ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందిని తనకు ఏ హాని జరిగినా.. ప్రభుత్వానిదే బాధ్యతని వాపోయారు. గిరిజనుల తరఫున మాట్లాడుతున్నందుకే తన మీద కక్ష కట్టారన్నారు.