జార్ఖండ్, డిసెంబర్ 24: జార్ఖండ్ రాష్ట్రంలోని కొలెబిరా అసెంబ్లీ స్థానంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఘాన విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థిపై కాంగ్రెస్ అభ్యర్థి నమన్ బిక్సల్ కొంగరి 9,658 ఓట్ల మెజర్టీతో విజయకేతనం ఎగురవేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నమన్ కు 40,343 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి సొరెగ్ కు 30,685 ఓట్లు వచ్చాయి. అక్కడ అధికారంలో బీజేపీ ప్రభుత్వమే ఉన్న సంగతి గమనార్హం.
కాగా, మొన్నటి వరకు ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన జార్ఖండ్ పార్టీ కి చెందిన ఎరోస్ ఎక్కా ఓ హత్య కేసులో యావజ్జీవ శిక్షకు గురి కావడంతో ఈ సీటు ఖాళీ అయింది. ఇక్కడి నుంచి పోటీ చేసిన ఆయన భార్య మీనన్ ఎక్కాకు కేవలం 16,445 ఓట్లు మాత్రమే వచ్చాయి.