విజయవాడ, డిసెంబర్ 24: నగరంలోని ప్రెస్ క్లబ్ లో ఈ రోజు ఉదయం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్ లో ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్, కృష్ణా అర్బన్ యూనిట్, వి.ఆర్ రాయల్ డయోగ్నోస్టిక్స్ రీసెర్చ్ సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సగం రాయితీతో కూడిన ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీయూడబ్ల్యూజే అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేశ్వరరావు తెలిపారు. ప్రింట్, ఎలకా్ట్రనిక్ మీడియాలో పనిచేసే జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు 50 శాతం రాయితీలో సూమారు 250 రకాల పరీక్షలు నిర్వహిస్తారని, జర్నలిస్ట్ మిత్రులందరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరారు.