మధురై, జూలై 27 : నేడు భారత ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులోని రామేశ్వరం నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఉత్తరప్రదేశ్లోని అయోధ్యకు వెళ్లే రైలును వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. రామేశ్వరం- ఫైజాబాద్ (వయా అయోధ్య) వరకు ఉండే ఈ రైలు మార్గం గూడూరు, విజయవాడ, తెలంగాణలోని వరంగల్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలు (నెం.16793/16794) ఆగస్టు 2 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుందని దక్షిణ మధ్య రైల్వే బుధవారం తెలిపింది. ఈ రైలు రామేశ్వరంలో ప్రతి ఆదివారం రాత్రి 11.50కి, ఫైజాబాద్లో ప్రతి బుధవారం రాత్రి 11.55 గంటలకు బయలుదేరుతుంది.