కుదిరిన బీహార్ సీట్ల సర్దుబాటు..పాశ్వాన్ కు రాజ్యసభ సీటు!

SMTV Desk 2018-12-24 11:09:14   Elections 2019, Bihar, BJP, JDU, LGP, alliance, Seat Sharing

పాట్నా, డిసెంబరు 24: 2019 బీహార్ లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. తమకు అనుకూల విధంగా, సీట్ల సంఖ్య ఉంటేనే ఎన్డీయేతో కలిసుంటామని ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్ స్పష్టం చేసారు. కాగా, ఆరు సీట్లలో పోటీ చేసేందుకు ఆయన నిర్ణయించుకున్నారు. బీహార్ లో మొత్తం 40 సీట్లుండగా, బీజేపీ 17, జేడీయూ 17 సీట్లలో, 6 సీట్లలో ఎల్జేపీ పోటీ పడనున్నాయి. అయితే ఎన్నికలకన్నా ముందుగానే పాశ్వాన్ ను రాజ్యసభకు పంపించేందుకూ ఎన్డీయే పెద్దలు అంగీకరించారు. పాశ్వాన్ ను రాజ్యసభకు పంపించనున్నామని అమిత్ షా స్వయంగా మీడియాకు తెలిపారు.

పాశ్వాన్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ లతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, 2014లో రాష్ట్రంలో 31 సీట్లలో విజయం సాధించామని, ఈసారి అంతకుమించి సీట్లు రానున్నాయని అంచనా వేశారు. కాగా, ఎన్డీయే నుంచి ఇటీవల ఉపేంద్ర కుష్వాహా నేతృత్వంలోని ఆర్ఎస్ఎల్పీ బయటకు వచ్చిన తరువాత, ఆ అవకాశాన్ని పాశ్వాన్ సమర్థవంతంగా వినియోగించుకున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.