హైదరాబాద్, డిసెంబర్ 23: ఈ నెల 26 నుండి ఓటరు జాబితా సవరణల ప్రక్రియ మొదలవనుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రెండు నెలల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని జిహెచ్ఎంసి సర్కిల్ 15 డిఎంసి ఉమాప్రకాష్ శనివారం వొక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన నమోదుకు సంబంధించి ఈ నెల 26వ తేదీన డ్రాఫ్ట్ ఓటరు జాబితాను విడుదల చేస్తామన్నారు.
అదే రోజు నుంచి జనవరి 25వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదు,పొరపాట్ల సవరణలకు అభ్యంతరాలను స్వీకరిస్తామన్నారు. ఫిబ్రవరి 18వ తేదీలోపు అభ్యంతరాలకు సబంధించిన దరఖాస్తులను ఆమోదించి 22వ తేదీన పూర్తి స్థాయి ఓటరు జాబితాను విడుదల చేస్తామన్నారు. 26 నుంచి ప్రారంభమయ్యే ఓటరు నమోదును అందరూ సద్వినియోగం చేసుకోవాలని డిఎంసి ఉమాప్రకాష్ కోరారు.