హైదరాబాద్, డిసెంబర్ 22: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కొండా మురళి తన పదవికి రాజీనామా చేస్తూ మండలి చైర్మన్ స్వామిగౌడ్ కు తమ రాజీనామా పత్రాన్ని అందించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎర్రబెల్లి దయాకర్ రావును మంత్రివర్గంలోకి తీసుకోవడానికే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును ఓడగొట్టారని 30 ఏళ్లుగా తమ కుటుంబానికి ప్రత్యర్థిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్రావును టీఆర్ఎస్లోకి చేర్చుకోవడం తమకు నచ్చలేదన్నారు.
తాజా మంత్రివర్గంలో ఎర్రబెల్లికి మంత్రి పదవి ఇవ్వాలని చూస్తున్నారని కొండా మురళీ ఆరోపించారు. ప్రజల అండతో దొరల పాలనను ప్రతిఘటించి పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఆయన రాజీనామా లేఖ ఇచ్చిన గంట వ్యవధిలోనే మురళీ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు శానసమండలి ఛైర్మన్ స్వామిగౌడ్ ఆదేశాలు జారీ చేశారు.