హైదరాబాద్ , డిసెంబర్ 22 :తెలంగాణ ఎన్నికలు రసవత్తంగా ముగిసి కెసిఆర్ సీఎం అయ్యాడు . అది అంటుంటే కాంగ్రెస్ గెలవకపోతే పీకకోసుకుంటా అని నిర్మాత బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే . కాంగ్రెస్ ఘోర పరాజయంతో సోషల్ మీడియా లో ట్రోల్ పేజెస్ కి దొరికి పోయాడు . ఆ ట్రోల్స్ మరి శృతిమించాయి .
కాగా తాజాగా వొక ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ మాట్లాడుతూ " కార్యకర్తలకి ఉత్సాహం తేవడానికి ,అత్యుత్సాహం తో ఆ మాట అన్నాను, అంతే గాని దాని ఉద్దేశం వేరేది కాదు, నా మీద వాళ్ళు బ్రతకడమేంటి నాలాగా చాలా మంది అన్నారు వాళ్ళందరి దగ్గరికి ఎందుకు వెళ్లరు ?. సోషల్ మీడియా వచ్చిన ట్రోల్ల్స్ వల్ల మా పిల్లలు ,శ్రేయోభిలాషులు చాలా బాధపడ్డారు , నాకు చాలా బాధ అనిపించింది ".
బండ్ల గణేష్ సోషల్ మీడియాలోని ట్రోల్ పేజెస్ ని ఉద్దేశిస్తూ " శవాల మీద చిల్లర ఏరుకునే రకాలు , వేరే వాళ్ళని కించపరుస్తూ బ్రతకడం కూడా వొక బ్రతుకేనా ? మొత్తానికి నా పేరు మీద నాలుగు డబ్బులు సంపాదించుకుని ఉంటారు న్యూ ఇయర్ కి బట్టలు కొనుక్కుని ఎంజాయ్ చేస్కోండి " అంటూ నిప్పులు చెరిగాడు .