వాషింగ్టన్, డిసెంబర్ 22: పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్, ఐక్యరాజ్యసమితి అధ్యక్షుడు ఆంటోనియో గట్టర్స్కు ఫోన్ చేసి భారత దేశంలోని కాశ్మీర్ విషయం గురించి మాట్లాడరని సమాచారం. దీని గురించి స్వయంగా ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ స్టీఫెన్ డుజార్రిక్ పీటీఐకు వెల్లడించారు. స్టీఫెన్, పీటీఐతో మాట్లాడుతూ పలు దేశాల ప్రధానులు, అధ్యక్షులు ఐరాస అధ్యక్షుడితో మాట్లాడటం సర్వ సాధరణం. అందులో భాగంగానే ఇమ్రాన్ ఖాన్, ఆంటోనియోకు ఫోన్ చేశారన్నారు. ఆ సమయంలో ఇమ్రాన్కు కశ్మీర్పై తమ వైఖరేంటో చెప్పామన్నారని స్టీఫెన్ తెలియజేసారు. కానీ ఇరువురు మధ్య జరిగిన సంభాషణ వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.
కొన్ని రోజులుగా కశ్మీర్ వ్యవహారంతో పాటు మరి కొన్ని సందర్భాల్లో పాకిస్థాన్ తీరుపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ తీరును విమర్శిస్తూ ‘మీ పని మీరు చూసుకుంటే మంచిదం టూ భారత్ తీవ్ర స్థాయిలో జవాబిచ్చింది. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ ఆంటోనియోతో మాట్లాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. కశ్మీర్ అంశం పరిశీలన గురించి ఐక్యరాజ్యసమితి 1949లో మిలిటరీ అబ్సర్వర్ గ్రూపును ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇందులో 118 మంది ఐక్యరాజ్యసమితి సిబ్బంది పనిచేస్తున్నారు.