విశాఖపట్నం, డిసెంబర్ 22: ఈ రోజు నగరంలో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా ఎవరికి మద్దతిస్తారన్న దానిపై స్పందిస్తూ ఎన్నికల తర్వాత నా నిర్ణయం వెల్లడిస్తాను. ఇప్పటికిప్పుడే మేము దీనిపై మాట్లాడకూడదు. ఈ అంశంపై మేమంతా కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అని పేర్కొన్నారు.