ఖమ్మం, డిసెంబర్ 22: తెలంగాణ రాష్ట్ర ముందస్తు ఎన్నికల్లో ఖమ్మం జిల్లా సత్తపల్లి నియోజకవర్గం నుండి సండ్ర వెంకటవీరయ్య, అశ్వరావు పేట నియోజకవర్గం నుండి మచ్చా నాగేశ్వరరావు వీరిద్దరూ టిడిపి నుండి పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరూ ఈ నెల 26 తర్వాత టిఆర్ఎస్ లోకి మకాం మారుస్తున్నారని అని పలు వర్గాలు చెప్పుకుంటున్నాయి.