హైదరాబాద్, డిసెంబర్ 22: తెలుగు రాష్ర్టాలకు కృష్ణానదీ జలాల విడుదలకు అనుమతి లభించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు నీటి విడుదలకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణకు46.90, ఆంధ్రప్రదేశ్కు 33.40 టీఎంసీలకు అనుమతి ఇచ్చింది. వచ్చే ఏడాది తెలంగాణ రాష్ట్రం వినియోగించుకునేందుకు 9 టీఎంసీలు రిజర్వ్లో ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను బోర్డు సభ్య కార్యదర్శి పరమేశం జారీ చేశారు.