హైదరాబాద్, డిసెంబర్ 21: ప్రముఖ కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్లో విలీనం చేయాల్సిందిగా ఎమ్మెల్సీలు మండలి ఛైర్మన్కు కోరిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పై ఆకుల లలిత, సంతోష్ కుమార్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు నచ్చే టీఆర్ఎస్లో చేరుతున్నామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తనకు ఎలాంటి అన్యాయం జరగలేదని అన్నారు. తెలంగాణ ప్రజలంతా టీఆర్ఎస్ వెంటే ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో ఈరోజు శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్కు పార్టీ విలీనం విషయమై లేఖ సమర్పించామని తెలిపారు. మరో తిరుగుబాటు ఎమ్మెల్సీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ‘తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పొత్తుతో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగింది. చంద్రబాబు వచ్చి తెలంగాణ ఎన్నికల్లో ప్రచారం చేయడం మాకు నచ్చలేదు. టీఆర్ఎస్లో మా ఇష్టపూర్వకంగానే చేరుతున్నాం. ఈ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు ఎలాంటి హామీలు ఇవ్వలేదు అని వ్యాఖ్యానించారు.