అమరావతి, డిసెంబర్ 21: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయ పాలైన టిడిపి అనంతరం కాంగ్రెస్ తో పొత్తు తదితర అంశాలపై ఈ రోజు చర్చించారు. ఈ సమావేశంలో టిడిపి అధినేత, ఏపి సియం చంద్రబాబు మాట్లాడుతూ సహకరిస్తానన్న కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే తప్పేంలేదు అని తెలంగాణలో తాను ప్రచారంలో పాల్గొనడం వలనే అక్కడ పోటీ వాతావరణం ఏర్పడింది. కేంద్రం నుంచి మోది, తెలంగాణ నుంచి కేసిఆర్లు ఏపి రావడం మంచిదేనని..గందరగోళం సృష్టించడానికే వస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో కూడా ఇంకా చాలా జరగబోతున్నాయని, అన్నింటికీ సిద్ధంగా ఉండాలని నేతలకు సూచించారు. ఏపికి బిజెపి సహకరించడం లేదని ..సహకరిస్తున్న కాంగ్రెస్తో కలిస్తే తప్పేంలేదు అని చంద్రబాబు అన్నారు.