బెంగళూరు, డిసెంబర్ 20: పరారీలో వున్న విజయ్ మాల్యా తన యూనైటెడ్ బ్రూవరీస్ కంపనీని మూసివేయవద్దంటూ పెట్టుకున్న పిటిషన్ను కర్ణాటక హైకోర్టు వాయిదావేసింది. ఈ కంపెనీని అమ్మివేసి బ్యాంకు రుణాలను చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన ధర్మాసనాన్ని కోరారు. రూ.13,900 కోట్ల విలువైన యునైటెడ్ బ్రూవరీస్ను ఈడీ అధికారులు ఇప్పటికే జప్తు చేశారు. న్యాయపరమైన చిక్కులతో కష్టాల్లో ఉన్న విజయ్ వచ్చే సంవత్సరం యూకే హైకోర్టు దివాళా కేసులో కూడా విచారణ ఎదుక్కోనున్నట్లు సమాచారం