విజయవాడ, డిసెంబర్ 20: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలెప్పుడు వస్తాయా అని ప్రజలు అందరు ఎదురు చూస్తున్నారని వైసీపీ నేత లక్ష్మీపార్వతి అన్నారు. విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఏపీలో ఎన్నికలు వస్తే చంద్రబాబును ప్రజలు ఇంటికి పంపిస్తారన్నారు. ఎన్నికలొస్తున్నాయని అమరావతిలోని నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు మాయమాటలు చెబుతున్నారని విమర్శించారు. చంద్రబాబు మాయమాటలను ప్రజలు నమ్మొద్దని లక్ష్మీపార్వతి కోరారు.