హైదరాబాద్, డిసెంబర్ 20: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మహ్మద్ అలీ ఈరోజు హోం శాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు సచివాలయానికి వెళ్లిన ఆయన, ‘డి బ్లాక్ లోని తన ఛాంబర్ లో హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సచివాలయానికి రావడానికి ముందు, నాంపల్లిలోని యూసుపైన్ దర్గాకు మహ్మద్ అలీ వెళ్లారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, పోలీస్ ఉన్నతాధికారులు తదితరులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం, మహ్మద్ అలీ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం కొనసాగేలా చూస్తానని, ‘ఫ్రెండ్లీ పోలీసింగ్ తో పనిచేస్తామని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు సాగుతాం అని అన్నారు.