గంభీర్ కు నోటీసులు జారీ చేసిన కోర్టు

SMTV Desk 2018-12-20 14:23:59  Team india, gowtham ghambheer, Retairdment, Court notice

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 20: భారత క్రికెట్ టీం నుండి తాజాగా అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించిన మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌కు ఢిల్లీ కోర్టు బెయిలబుల్ నోటీసులు జారీ చేసింది. టీం ఇండియా ఓపెనర్‌గా జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలు అందించిన గంభీర్ కొద్ది రోజుల క్రితం తాను రిటైర్‌ అవుతున్నట్లు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాడు.అయితే గతంలో గంభీర్ ఢిల్లీకి చెందిన రుద్ర బిల్డ్‌వెల్ ప్రాజెక్టుకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. అలా ఉన్నప్పుడు అతను ఆ సంస్థను మోసం చేశాడని కేసు నమోదైంది. దీంతో కోర్టు గంభీర్‌కు నోటీసులు జారీ చేసి.. జనవరి 24, 2019లోగా కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.