హైదరాబాద్ , డిసెంబర్ 20 : ఈ మద్యకాలంలో సుమంత్ వైవిద్యభరితమైన సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆయన రీసెంట్ గా చేసిన సుబ్రహ్మణ్యపురం ఫరవాలేదనిపించుకుంది. ఆయన తాజా సినిమా ఇదం జగత్ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. అంజు కురియన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి శ్రీకాంత్ నీలకంఠం దర్శకత్వం వహించాడు.
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. వొక రిపోర్టర్ సైలెంట్ గా ఉన్నాడంటే దాని అర్థం .. వాడు మనకి దగ్గరగా వచ్చేశాడని అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతోంది. ఎమోషన్, యాక్షన్, సస్పెన్స్ ల తో కూడిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి . చూద్దాం ఈ సినిమా ఆ అంచనాలని ఏ మాత్రం అందుకుంటుందో.