న్యూ ఢిల్లీ, డిసెంబర్ 19: కేంద్రం తెలుగు రాష్ట్రాలో ఆసెంబ్లీ స్థానాల పెంపు ఇప్పట్లో సాధ్యం కాదని రాజ్యాంగంలోని 170 (3)వ అధికారణం ప్రకారం 2026 తర్వాత సేకరించే తొలి జనాభా లెక్కల ప్రకారమే ఆసెంబ్లీ సీట్ల పెంపు ఉంటుందని మరోసారి స్పష్టం చేసింది. ఈమేరకు రాజ్యసభలో ఎంపీ సుజనాచౌదరి అడిగిన ప్రశ్నకు హోంశాఖ సహాయ మంత్రి హన్స్రాజ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.