న్యూ ఢిల్లీ, డిసెంబర్ 19: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ నేను విలేఖరులతో మాట్లాడేందుకు భయపడే ప్రధానమంత్రిని కాదు అంటూ చేసిన వాఖ్యలపై కేంద్రమంత్రి అబ్బాస్ నఖ్వీ స్పందించారు. మాజీ ప్రధానమంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇతరులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం, వారు రాసి ఇచ్చిన స్క్రిప్టును చూసి మాట్లాడుతుంటారని నఖ్వీ ఆరోపించారు. ఇప్పటికి కూడా మన్మోహన్ సింగ్ ఇతరుల స్క్రీప్టుపై మాట్లాడుతున్నారని నఖ్వీ ప్రతి విమర్శలు చేశారు. కాని ప్రస్థుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడటానికి స్క్రీప్టు కాని డైరెక్టరు కాని అవసరం లేదని కేంద్రమంత్రి నఖ్వీ వ్యాఖ్యానించారు.