అజ్ఞాతంలో నిత్యానంద స్వామి...!

SMTV Desk 2018-12-19 14:32:53  nithyananda swamy, Karnataka police

బెంగళూరు, డిసెంబర్ 19: అనేక ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖ వివాదాస్పద స్వామి నిత్యానంద గత నెల రోజుల నుండి తన ఆశ్రమంలో కనిపించకపోయేసరికి నగర పోలీస్ అధికారులు అతను విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు. భూ ఆక్రమణల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన కోసం ఆశ్రమానికి వచ్చిన పోలీసులు వచ్చారు. బెంగళూరు శివార్లలోని ఆయనకు బిడది ఆశ్రమం ఉంది. నిత్యానందకు ఓ కేసు నిమిత్తం సమన్లు ఇచ్చేందుకు అక్కడికి పోలీసులు వచ్చారు. నెల రోజుల నుంచి ఆయన బహిరంగంగానూ కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. ఆయన దేశం విడిచి పారిపోయారనే వార్తలు కర్ణాటకలో గుప్పుమన్నాయి. నల్లధనం దాచుకోవడానికి స్వర్గధామంగా భావించే కేమన్ ఐల్యాండ్‌కు ఆయన పారిపోయారని వార్తలు వస్తున్నాయి. అక్కడ మఠం ఏర్పాటుకు కొద్ది రోజుల కిందట భూమిని కూడా కొనుగోలు చేశారని తెలుస్తోంది. నిత్యానంద స్వామి ఉత్తరాది పర్యటనలో ఉన్నారని ఆశ్రమ నిర్వాహకులు చెబుతున్నారు. ఆయన పాస్‌పోర్టు రెన్యూవల్‌కు ఇటీవల పోలీసులు తిరస్కరించిన నేపథ్యంలో, నిత్యానంద దేశం విడిచి పారిపోయే అవకాశం లేదని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు.