న్యూ ఢిల్లీ, డిసెంబర్ 18: నగరంలో అమన్ నిహార్ ఏరియాలో మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తిపై కత్తితో దాడి చేసిన ఘటన తాజాగా వెలుగులోగి వొచ్చింది. రాజేశ్ అనే వ్యక్తి ప్రాణాలు విడిచాడు. సుభాష్ (32) అనే వ్యక్తి భార్య పట్ల రాజేశ్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో రాజేశ్తో సుభాష్ వాగ్వాదానికి దిగాడు. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన సుభాష్ నిందితుడు రాజేశ్పై కత్తితో ఐదు పోట్లు పొడిచి..అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రగాయాలతో ఉన్న రాజేశ్ను ఆస్పత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారని డీసీపీ సెజు కురువిల్లా తెలిపారు. నిందితుడిపై హత్యాకేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు