హైదరాబాద్, జూలై 26 : దళితులపై జరుగుతున్న దాడులకు బాద్యత వహిస్తూ మంత్రి కేటీఆర్ పదవికి రాజీనామా చేయాలని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సబితా మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో ఇసుక మాఫియా గురించి ప్రశ్నించిన వారిని అక్రమ కేసులలో ఇరికించి వారిని జైళ్ళకు పంపడం అన్యాయమని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. కాగా కేటీఆర్ ఒక బాధ్యత గల పదవిలో ఉండి అసలు దళితులపై ఎలాంటి దాడి జరగలేదంటూ ఆవేశంతో మాట్లాడకుండా సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించాలని తెలిపారు. వారిపై దాడులు జరగకపోతే ఆసుపత్రిలో చికిత్స ఎందుకు అందిస్తున్నారో చెప్పాలంటూ మండిపడ్డారు.