న్యూ ఢిల్లీ, డిసెంబర్ 18: ఆమ్ ఆద్మీ పార్టీ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు సంజయి సింగ్ తమ పార్టీ వచ్చే లొక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నట్లు వస్తున్న వార్తలపై చాల ఘాటుగా స్పందించారు. ఇవన్నీ వదంతులేనని, వచ్చే ఎన్నికల కోసం మేము ఇప్పటివరకు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదు. ఇతర రాజకీయ పార్టీలే దీనిపై వదంతులు సృష్టిస్తున్నాయి అని ఆయన పేర్కొన్నారు.