పెర్త్, డిసెంబర్ 17: పెర్త్ వేదికగా భారత్తో జరుగుతున్న రెండో టెస్టులో ఆస్ట్రేలియా నాలుగో రోజు ఆట ప్రారంభించింది. క్రీజులో టిమ్ పైన్ (8), ఉస్మాన్ ఖవాజా (41) ఉన్నారు. 43 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసిన విషయం తెలిసిందే.