హైదరాబాద్ , డిసెంబర్ 14 :
హనురాఘవపూడి దర్శకత్వం లో శర్వానంద్ , సాయి పల్లవి జంటగా తెరకెక్కుతున్న చిత్రం " పడి పడి లేచె మనసు ". ఈ నెల 21 న విడుదలకు సిద్దమవుతున్న ఈ చిత్ర ట్రైలర్ ని ఇటీవల విడుదల చెయ్యగా ఇప్పటికి 1 మిలియన్ వ్యూస్ ని దాటిందని . బి ఏ రాజు తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు . ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఇదవరకెప్పుడూ శర్వానంద్ సినిమా ఇంత వేగంగా 1 మిలియన్ వ్యూస్ సాధించలేదు . ఇలాంటి స్పందన సినిమా పట్ల నెలకొన్న అంచనాలని తెలియజేస్తుంది .