చంద్రబాబుకి సవాల్ విసిరిన తలసాని.!

SMTV Desk 2018-12-14 15:03:39  Talasani Srinivas Yadav, Chandrababu, Telangana Elections

హైదరాబాద్, డిసెంబర్ 14: తెరాస పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తన అసెంబ్లీ ఎన్నికల నిర్ణయం తీసుకున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమ పాలనపై విశ్వాసం ఉన్నందున ప్రజలు తమకు ఓట్లు వేసి గెలిపించారన్నారు. సనత్ నగర్ లో డబ్బు పంపిణి గురించి అడగగా ఎవరు ఎన్ని చేసిన, టిడిపి చీఫ్ చంద్రబాబు నాయుడు కూడా తన నియోజకవర్గంలో పోటీ చేస్తే, ఓటమిని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

మాజీ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజ్గోపాల్ వొక దొంగని, తన నకిలీ సర్వేలతో రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించడంలో ఆయన విజయం సాధించారన్నారు. టీవీలో, పేపర్ లో చూసాను బెట్టింగుల గురించి ఆయన సర్వేలు నమ్మి బెట్టింగులువేసిన వాళ్ళంతా నష్టపోయారు. ఎన్నికలు జరుగుతున్న సమయంలో, ఎన్నికల కమీషన్ ఉత్తర్వులు జారీచేసిన కూడా ఎన్నికలకు రెండు రోజుల ముందు అలా సర్వేలు బయటపెట్టడం తప్పన్నారు.