ఈ నెల 28 న "పైసా వసూల్" స్టంపర్‌

SMTV Desk 2017-07-26 12:26:48  balakrishna, paisa vasool, Stampar, shreya, Puri Jagannadh

హైదరాబాద్, జూలై 26: బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం పైసా వసూల్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణకు జంటగా శ్రేయ నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణని సరికొత్తగా చూపిస్తున్నాడట పూరీ. ఈ సందర్భంగా దర్శకుడు మీడియా మాట్లాడుతూ... బాలకృష్ణతో సినిమా చేయడం నాకు ఎంతో గర్వంగా వుంది నా కెరీర్‌లోనే మర్చిపోలేని చిత్రంగా నిలిచిపోతుంది సినిమాలో నందమూరి అభిమానులు కోరుకునే అంశాలన్నీ ఉంటాయని తెలిపారు. సినిమా ఎలా ఉండబోతున్నదో 28న విడుదల కానున్న స్టంపర్‌ని చూస్తే అర్థమవుతుంది. రెగ్యులర్‌గా విడుదల చేసే ట్రైలర్, టీజర్‌లకు భిన్నంగా స్టంపర్ ఉంటుందని తెలిపారు చిత్ర యూనిట్. ముస్కాన్, కైరాదత్, అలీ, పృథ్వీ, పవిత్రా లోకేష్, విక్రమ్‌జిత్, కబీర్‌బేడీ తదితరులు ఈ చిత్రం లో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఈ చిత్రం పూరికి బాలయ్య మంచి విజయాన్ని అందిస్తుంది అని చిత్ర వర్గాలు చెప్తున్నాయి.