తమిళనాడు, డిసెంబర్ 12: ఆంద్రప్రదేశ్ కి చెందిన అయ్యప్ప స్వాములు శబరిమల యాత్ర ముగించుకొని తిరిగివస్తుండగా మంగళవారం రాత్రి తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో వారు ప్రయాణిస్తున్న బస్సు బోల్తాపడి వొకరు మృతిచెందగా పలువురికి గాయాలయ్యాయి. ఈ స్వాములందరు తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపల్లి, వాకతిప్ప గ్రామాలకు చెందిన 40మంది అయ్యప్పమాలదారులని సమాచారం. ఈ నెల 2న మండపేటలోని గోపీకృష్ణ ట్రావెల్స్కి చెందిన బస్సులో శబరిమలకు బయలుదేరారు, వారు తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఈ దుర్ఘటనలో వాకతిప్ప గ్రామానికి చెందిన అయిశెట్టి సూర్యావతి(52) మృతిచెందింది. సుమారు 30 మందికి పైగా గాయాలయ్యాయి. వారంతా తమిళనాడులోని పలు ఆసుపత్రుల్లో చికిత్సపొందుతున్నారు. ఈ ఘటనతో రెండు గ్రామాల్లో విషాద ఛాయలు వెలువడ్డాయి.