ఆడిలైడ్ , డిసెంబర్ 08: ఆసీస్ గడ్డపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఆసీస్ గడ్డపై టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆసీస్పై తొమ్మిది టెస్లుల్లోనే 1000 పరుగులు చేసిన నాలుగో భారత ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. అంతకు ముందు సచిన్, వివిఎస్ , రాహుల్ ఈ ఘనతను సాధించారు. ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్లో 235 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది.