కోదాడలో భారీ బహిరంగ సభ.!

SMTV Desk 2018-12-05 11:19:41  Rahul Gandhi, Chandrababu, Mahakutami

హైదరాబాద్, డిసెంబర్ 5: ఈ రోజు ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో నాయకులందరు ప్రచారజోరులో ఉన్నారు. ప్రజకూటమి నాయకులు ఈరోజు కోదాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసారు, ఈ సభకు మహాకూటమి ముఖ్యనాయకులు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర ముఖ్యనాయకులు అందరు హాజరు అవుతారు అని సమాచారం.

ఈ సభలో మహాకూటమి మ్యానిఫెస్టో గురించి విధివిధానాల గురించి మాట్లాడతారు. ఈ రోజు ప్రచారానికి చివరి రోజు అవడంతో అన్ని పార్టీలు తమ ప్రచారాన్ని హోరాహోరీగా కొనసాగిస్తున్నాయి.