400 కోట్లు..@ 2.ఓ

SMTV Desk 2018-12-04 11:06:15  400 crores,akshay kumar, rajiniknath

హైదరాబాద్, డిసెంబర్ 04: శంకర్, రజిని కాంబినేషన్ లో క్రేజీ మూవీగా వచ్చిన 2.ఓ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. నవంబర్ 29న రిలీజైన ఈ సినిమా కలక్షన్స్ విషయంలో నిర్మాతలు సైలెంట్ గా ఉన్నారు. అయితే ఫైనల్ గా నిర్మాణ సంస్థ నుండి 2.ఓ అఫిషియల్ కలక్షన్స్ రిపోర్ట్ వచ్చింది. 4 రోజుల్లో 2.ఓ 400 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇండియాలో 210 కోట్ల నెట్ రాగా ఓవర్సీస్ లో 3 మిలియన్ డాలర్స్ వసూళు చేసింది.

యూఏఈ, జపాన్, ఆస్ట్రేలియా అన్ని ఏరియాల్లో కలిపి 400 కోట్ల గ్రాస్ అన్నమాట. చెన్నైలో 4 రోజుల్లో 10 కోట్లు రాబట్టిన 2.ఓ. కేరళలో 6 కోట్లు, కర్ణాటకలో 5 కోట్లు వసూళు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో నైజాంలో 13.75 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది 2.ఓ. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ మూవీని 72 కోట్లకు కొనుగోలు చేశారు. ఇప్పటివరకు తెలుగు రెండు రాష్ట్రాల్లో 35 కోట్ల కలక్షన్స్ రాగా ఇంకా బ్రేక్ ఈవెన్ కోసం 40 కోట్ల దాకా రాబట్టాల్సి ఉంది. పరిస్థితి చూస్తే అంత వసూళు చేయడం కష్టమే అన్నట్టు ఉంది.