హైదరాబాద్ , నవంబర్ 25: హైదరాబాద్ , నవంబర్ 25: ‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో బ్లాక్బస్టర్ విజయం అందుకున్నారు నటి పాయల్ రాజ్పుత్. తొలి చిత్రంతోనే ప్రేక్షకుల మనసులు దోచుకున్న పాయల్కు వరుసగా అవకాశాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే తమిళం, తెలుగులో కొన్ని చిత్రాల్లో నటిస్తున్నారు. అయితే ఇప్పుడు పాయల్కు ప్రముఖ దర్శఖుడు క్రిష్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్’ బయోపిక్లో నటించే బంపర్ ఆఫర్ దక్కినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఇప్పటికే ఎవరెవరు ఏయే పాత్రల్లో ఎవరు నటిస్తున్నారన్న విషయంపై కొంతమేర క్లారిటీ వచ్చింది. ఏఎన్నార్, హరికృష్ణ, శ్రీదేవి తదితరుల పాత్రల్లో నటించేవారి వివరాలను ఇప్పటికే చిత్రబృందం ప్రకటించింది.
అయితే ఈ చిత్రంలో సహజ నటి జయసుధ పాత్రలో పాయల్ రాజ్పుత్ను ఎంపికచేసుకున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. పాయల్ మాటతీరు, హావభావాలు అచ్చం జయసుధలాగే ఉన్నాయని చిత్రబృందం భావించి ఆమెను తీసుకున్నారట. ఎన్టీఆర్-జయసుధ కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. ‘డ్రైవర్ రాముడు’, ‘గజదొంగ’, ‘మహా పురుషుడు’, ‘అడవి రాముడు’ తదితర చిత్రాల్లో జంటగా నటించారు. ‘ఎన్టీఆర్’ బయోపిక్లోని తొలి భాగం అయిన ‘కథానాయకుడు’ వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది. రెండో భాగం ‘మహానాయకుడు’ జనవరి 24న విడుదల కానున్నాయి.