హైదరాబాద్, నవంబర్ 24: మేడ్చల్లో జరిగిన సోనియాగాంధీ ప్రసంగంపై టిఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హిందీలో మాట్లాడిన సోనియా ప్రసంగాన్ని తెలుగు అనువాదంలో ఆమె మాట్లాడని మాటలు కూడా చొప్పించారని తెరాస ఎంపీ వినోద్ ఆరోపించారు. సోనియాను భ్రమల్లో పెట్టి తెలంగాణ కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెప్పించారని వినోద్ ధ్వజమెత్తారు. తెలంగాణ ఎవరో ఇస్తే వచ్చింది కాదన్నారు. కెసిఆర్ అమరణ దీక్ష తర్వాత తెలంగాణ ఇస్తామన్న ప్రకటన అలస్యం కావడం వల్లే ఆత్మహత్యలు జరిగాయని చెప్పారు. డిసెంబర్ 11న సోనియా సహా కూటమి నేతల కళ్లు తెరిపించే ఫలితాలు వస్తాయన్నారు. రాహుల్ గాంధీ ప్రసంగం విన్నాక తలను దేంతో కొట్టుకోవాలో తెలియడంలేదని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా అంటే ఏమిటో కాంగ్రెస్ నిర్వచనం చెప్పాలని వినోద్ డిమాండ్ చేశారు.