హైదరాబాద్, నవంబర్ 24: తెలంగాణలో సభ పెట్టి ఏపికి హామీలు ఇస్తారా?అని తెలంగాణ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. మేడ్చల్లో జరిగిన కాంగ్రెస్ సభపై శనివారం మీడియాతో మాట్లాడారు. ఏపికి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టమని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలతో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని చూసి ఏడుపొస్తోందని అనడం సరికాదన్నారు. తెలంగాణలో తాము అధికారంలో లేనందుకు, రానందుకు సోనియాకు దుఃఖ పడుతున్నట్లు తనకు అనిపిస్తోందని హరీశ్రావు ఎద్దేవాచేశారు. దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లు అయినా కాంగ్రెస్, బిజెపి, టిడిపి ప్రభుత్వాలు కనీసం తాగడానికి నీళ్లు ఇవ్వలేకపోయాయని, అలాంటిది ఇంటింటికీ నళ్లా నీళ్లిచ్చి దేశానికే తెరాస ప్రభుత్వం ఆదర్శంగా నిలిచిందన్నారు.